హవేళీఘనపూర్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ,పాఠశాలకు మౌలిక వసతులను కల్పిస్తున్నారు. హరితహారంలో ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడంతో ప్రహరీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్, మండల పరిధిలోని చౌట్లపల్లిలో రూ.10లక్షలతో నిర్మించిన ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. కొంత కాలంగా పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయి. నిత్యం రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి సీసాలు వేస్తున్నారు. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామస్తులు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విజ్ఞప్తి చేయడంతో నిధులు మంజూరు చేసి అధికారులు పనులు చేపట్టారు.
మౌలిక వసతుల కల్పించడం హర్షణీయం
విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు అవసరాలను గుర్తించి సమకూర్చడం హర్షనీయం. త ద్వారా విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఏర్పడుతుం ది. కొంత కాలంగా ప్రహరీ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ విషయాన్ని గుర్తించిన ప్రజాప్రతినిధులు,అధికారులు నిర్మాణానికి కృషి చేయడం అభినందనీయం.
-పద్మారావు, హెచ్ఎం చౌట్లపల్లి
మొక్కలు పెంచుకునేందుకు అవకాశం:
పాఠశాల ప్రహరీ లేక ఆవరణలో నాటిన మొక్కలను పశువులు నాశ నం చేయడంతో పచ్చదనం కరువైంది. నాటిన మొక్కలు విరిగిపోతున్నాయి. నిత్యం పాఠశాల ఆవరణలో మద్య సీసాలు పారేస్తున్నారు. దీం తో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చే సి నిర్మాణం చేపట్టారు. దీంతో మొక్కలు పెంచడానికి అవకాశం లభిస్తుంది