సమస్యలు పరిష్కరించాలని కార్మికు లు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఉపాధిని కోల్పోయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆం దోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు.
మోదీ ప్రభు త్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించిందన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని, పెరిగిన ధరలకు కనుగుణంగా కార్మికులకు కనీస వేతన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.