కొల్చారం, డిసెంబర్ 20 : మండ లానికి ఏడు గ్రామ పంచాయతీ భవనా లు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభు త్వం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కింద అనుబంధ గ్రామాలు (ఆవాస ప్రాంతాలు), గిరిజన తండాలను నూ తన పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాల్లో పంచాయతీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల సౌకర్యాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు.
ఇటీవల ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ భవనాలను మంజూరుకు ప్రతిపాదనలు తీసుకోగా, మండలంలో కొత్తగా ఏర్పాటైన ఐదు కొత్త పంచాయతీలకు నాలుగు కొత్త గ్రామ పంచాయతీలతోపాటు శిథిలావస్థకు చేరిన మూడు పంచాయతీల్లో కొత్త భవనాల మంజూరుకు ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రతిపాదనలు పంపారు. కొత్త పంచాయతీలైన తుక్కాపూర్, సీతారాంతండా, వెంకటాపూర్, నాయిన్జలాల్పూర్తో పాటు రంగంపేట, కిష్టాపూర్, ఏటిగడ్డమాందాపూర్ పంచాయతీలకు ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున మంజూరయ్యాయి.
మండలంలో తుక్కాపూర్ గ్రామం లో పాఠశాల భవనంలో తరగతి గదులు అందుబాటులో లేకపోవడం, కమ్యూనిటీ హాల్ సైతం లేకపోగా, అద్దె భవనాలు కూడా దొరక్క సర్పంచ్ ఇంటి వద్దనే ఇరుకైన గదిలో పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించారు. తుక్కాపూర్ పంచాయతీలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసేందుకు ఇటీవల ఎమ్మెల్యే మదన్రెడ్డి రాగా, ఈ విషయాన్ని సర్పంచ్ మాధవీశ్రీశైలం, బీఆర్ఎస్ నాయకుడు దొడ్ల ఆంజనేయులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవీశ్రీశైలం మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే మదన్రెడ్డికి కృతజ్ఞతలు
ఇటీవల తుక్కాపూర్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే మదన్రెడ్డి దృష్టికి పంచాయతీకి భవనం కావాలని తెలిపాం. మరిన్ని మురికి కాల్వలు, సీసీ రోడ్లు కావాలని అడుగగా, పంచాయతీ భవనం మంజూరుకు హామీ ఇచ్చారు. మంజూరు ఉత్తర్వులు రావడం మా అదృష్టం. ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-దొడ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకుడు