మెదక్,అక్టోబర్7 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో లేకపోవడం వల్ల వేరే చోట నుంచి ఆక్సిజన్ తెచ్చారని ఫలితంగా రోగులు ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈ ప్లాంట్ ద్వార ఏకకాలంలో 120 మంది రోగులకు ఆక్సిజన్ అందించే సౌకర్యం అందుబాటులోకి వచ్చాందన్నారు.
ప్లాంట్ మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం డయాలసిస్ సెంటర్లో ఐదు బెడ్లు అందుబాటులో ఉన్నాయని మరో ఐదు బెడ్లు మంజూరు చేయాలని జిల్లా మంత్రి హరీష్రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
మెదక్ పట్టణ శివారులో రూ.9 కోట్లతో నిర్మిస్తున్న మాతా శిశు కేంద్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఉన్న రోగులతో మాట్లాడారు.
కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు ,దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్లు చంద్రశేఖర్, కిరణ్, రాహుల్, మున్సిపాల్ కౌన్సిలర్లు కిషోర్, జయరాజ్ వసంతరాజ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎం గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, ఉమర్, సురేశ్, శంకర్, వెంకటేశం, పట్టణ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సామ్సన్ సందీప్,ఉపాధ్యక్షుడు సాబీర్ హుస్సేన్ ఉన్నారు.