పటాన్చెరు, ఏప్రిల్ 9: ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ శ్రవణంలో పురోహితులు తెలిపారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ మందిరంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురోహితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, చక్కటి పంటలు పండుతాయని తెలిపారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సఫానదేవ్, మాజీ సర్పంచ్ దేవేందర్రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, గూడెం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చేతుల మీదుగా శ్రీరామనవమి వేడుకల ఆహ్వా న పత్రికను ఆవిష్కరించారు. ఏప్రిల్ 15నుంచి 19 వరకు పటాన్చెరు పట్టణంలోని శ్రీకోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించి, శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ తదితర నాయ కులు పాల్గొన్నారు.