జహీరాబాద్, డిసెంబర్ 21: అభివృద్ధి పనులు వే గంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 27న జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారని, పెండింగ్ పనులు వెంటనే పూర్తి చే యాలని సూచించారు. జహీరాబాద్ పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ భవనాన్ని ప్రా రంభించేందుకు సిద్ధం చేయాలని, పెండింగ్ పనులుంటే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ జావిద్ను ఆదేశించారు.
కోహీర్ మండలంలోని దిగ్వాల్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ముస్లిం మైనార్టీల కోసం జహీరాబాద్ షాదీఖాన హోతి (కే) శివారులో నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణంలో మినీ హజ్హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాత భవనాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రహిమత్నగర్లో డబు ల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేసి, అక్కడ లబ్ధ్దిదారులతో కలిసి భోజనాలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 12 కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఆయా సంఘాల నాయకులకు వాటి పత్రాలు మంత్రి అందజేస్తారని తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేయాలన్నారు. మంత్రి పర్యటనకు భారీగా జన సమీకరణ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఆర్డీవోలు రమేశ్బాబు, నగేశ్, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీసీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్మోహన్, డీఎంహెచ్వో గాయత్రీదేవి, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మోహినొద్దీన్, విజయ్మోహన్రెడ్డి, రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.