Smart motors | వ్యవసాయంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్నది. అన్నదాతలకు సాంకేతిక దన్ను ఇచ్చే దిశగా సర్కారు తనదైన కృషి చేస్తున్నది.. స్మార్ట్గా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో న్యాస్టా ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెకు ్టకింద చేపట్టనున్నారు.
– సిద్దిపేట, మే 4
రైతుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యంగా…
రైతులు తమ రోజువారీ కార్యకలపాలను సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి మరింత మెరుగ్గా నిర్వహించడం, విద్యుత్ను ఆదా చేయడం, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరులను మరింత సమర్థవంతగా వినియోగించుకోవడం, వ్యవసాయ క్షేత్రాలలో పొలాల డేటాను నిర్వహించడంతోపాటు వ్యవసాయానికి సాంకేతికతను జోడించడం లక్ష్యంగా న్యాస్టా పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. న్యాస్టా రూపొందించిన వెబ్ మొబైల్ అప్లికేషన్తో పరిష్కార మార్గాలు పొందుతూ స్మార్ట్గా వ్యవసాయం చేయవచ్చు.
ప్రాజెక్టుతో రైతులకు ఉపయోగాలు
* రైతులకు భద్రత అనగా రైతుల తమ పొలాల వద్దకు వెళ్లి మోటార్లు పెట్టడం లేదా బంద్ చేయడం వంటి బాధ తప్పుతుంది. రాత్రి వేళల్లో వెళ్లాల్సిన అవసరం ఉండదు.
* వరిపొలంలో నీరు నిలవడంతో దోమలు, ఇతర కీటకాలు వ్యాప్తి చెందుతాయి. ఇది రైతుల ఆరోగ్యానికి హానికరం. ఈ అప్లికేషన్ వినియోగంతో ఈ సమస్య ఉండదు.
* పంట ఉత్పాదకత పెరుగుతుంది. రైతులకు రవాణా ఖర్చులు, విద్యుత్ ఆదా, మోటార్ మెయింటెనెన్స్ కింద ప్రతి
సంవత్సరం రైతుకు సుమారు.
రూ.5400 వరకు ఆదా అవుతుంది. విద్యుత్ ఆదాతో 5హెచ్పీ మోటార్ వాడితే సుమారు.రూ.4000 అదే
7హెచ్పీ మోటార్ అయితే సుమారు రూ.6750 వరకు ఆదా అవుతుంది. న్యాస్టా పరికరాల ఖర్చు మార్కెట్ ఆందుబాటులో ఉన్న వాటితే పోల్చితే ఈ పరికరాన్ని అమర్చుకునేందుకు రూ.5,999 ఖర్చవుతుంది. ఈ పరికరం ఎస్ఎంఎస్, నెట్డాటా ఆధారంగా పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ మొబైల్ సిమ్ కోసం రూ.800 అవుతుంది. ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ఓవర్ ద ఎయిర్ డివైస్ సాఫ్ట్వేర్ అప్డేట్ డాటాపై పనిచేస్తుంది. ఈ యాప్లో అందుబాటులో ఉన్న పరికరం 4జీ/2జీ నెట్ ఆధారంగా పనిచేస్తుంది. 4.5 వాట్స్ విద్యుత్ సహాయంతో పనిచేస్తుంది.
స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ సిస్టమ్
సెల్ఫోన్ను రిమోట్గా ఉపయోగించి వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటార్ను నియంత్రించడం కోసం ఈ పరికరాన్ని ఇన్స్టాల్ చేసుకొని సాంకేతికతను ఉపయోగించి నీటిని, విద్యుత్ను వాడుకోవచ్చు. ఈ విధానం రైతులకు ఎంతో మేలు చేస్తుంది.
ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ ముఖ్యంగా వరిని పండించే రైతులు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారు సిఫారసు మేరకు పొలంలో తడి, పొడి పద్ధతిని అవలంబించవచ్చు. దీంతో ఆటోమేటిక్గా వరిపొలానికి కావాల్సిన నీటి అందించడం, తగ్గించడం వంటివి చేయవచ్చు. ఫలితంగా వరిలో నీటి యాజమాన్య సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మల్టీ మోటార్ మేనేజ్మెంట్
రైతులు తమ పొలాలకు నీటిని అందించడం కోసం వ్యవసాయ బావుల వద్ద మోటార్లను పెడుతారు. మొబైల్ వెబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న రైతులు రెండు లేదా అంత కన్నా ఎక్కువ మోటార్లకు మొబైల్ను రిమోట్గా ఉపయోగించి నియంత్రించవచ్చు.
వాల్వ్ మేనేజ్మెంట్ సిస్టమ్..
ఒకే వ్యవసాయ బావి లేదా నీటి వనరు ఉన్నా రైతు వాల్వ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగించి రైతులు నీటిని అందించే అవకాశం ఉంటుంది. సాగు చేసిన పంటల ఆధారంగా నీటిని వాల్వ్ ఉపయోగించడం ద్వారా పంటలకు అవసరం మేరకు నీటిని అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.