అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి
సిద్దిపేట అర్బన్, మే 23 : ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఇందులో ఎక్కువగా రెవెన్యూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మొత్తం 62 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ..ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చే రెవెన్యూ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి వారం ఆయా దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య, కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.