చేగుంట, ఫిబ్రవరి24: యాసంగి పంటలకు కావాల్సిన సాగునీరు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని ఇబ్రహీంపూర్, బోనాల్, కర్నాల్పల్లి తదితర గ్రామాల్లో కెనాల్ కాల్వలను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. చెరువులకు కెనాల్ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయాలని, చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటేనే యాసంగి పంటలు పండే అవకాశం ఉందన్నారు. పంటలు ఎండిపోక ముందే నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోమండ్ల నారాయణరెడ్డి, నాయిని రాజ్గోపాల్, మాజీ సర్పంచులు కొటారి అశోక్, నెల్లూర్, మోహన్రెడ్డి, సుదర్శనం, అలీ తదితరులున్నారు.