మెదక్ అర్బన్, ఆగస్టు 6 : ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించున్నారు. మెదక్ జిల్లాలో 2342 మంది ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకానున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సాపూర్లో మూడు, రామాయంపేటలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఫర్నిచర్, గాలి , వెలుతురు, నీటి వసతి ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వంహించేలా ఏర్పాట్లు చేశారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారు.
పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే రావాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఎస్పీ బాలస్వామి ఆదేశాలు జారీచేశారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్టికెట్లో పొందుపర్చి ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు , ఇతర వస్తువులకు అనుమతి లేదు. అభ్యర్థుల చేతులకు గోరింటాకు , మెహందీ వంటివి పెట్టుకోవడం వల్ల బయోమెట్రిక్లో వేలిముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదని, దాని ద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఎలాంటి మెహందీ లాంటి వాటిని పెట్టుకోవద్దని అధికారులు ఇదివరకే సూచించారు. ఎంపిక విధానం పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితులో నమ్మవద్దని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి , నోడల్ అధికారి జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 6: ఎస్సై అభ్యర్థుల ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 10 నుం చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రా ల్లో శనివారం అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షకు హాజరుకానున్న 5766 మం ది అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉం టుంది. పరీక్ష కేంద్రంలోకి బ్యాగులు, సెల్ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ అనుమతించబడవు.
సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు
గీతం ఇంజినీరింగ్ కళాశాల (రుద్రారం)లో రెండు పరీక్షా కేంద్రాలు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల (సుల్తాన్పూర్)లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మిగిలిన వాటిలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల(పటేల్గూడ),ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల (ఫసల్వాది), సెయింట్ అంథోనీ జూనియర్ కళాశాల (శాంతినగర్,సంగారెడ్డి), సెయిం ట్ అంథోనీ హైస్కూల్ (శాంతినగర్, సంగారెడ్డి), ఎల్లంకి డిగ్రీ కళాశాల (శాంతినగర్,సంగారెడ్డి), తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సంగారెడ్డి)లో మొత్తం పది సెంటర్లు ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
మెదక్ అర్బన్, ఆగస్టు6: జిల్లాలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరుగుతున్నందున ఐదు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని రీజినల్ కో ఆర్డినేటర్ గణపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల , నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ, రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎటువంటి జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు ఓపెన్ చేయరాదని పేర్కొన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
జిల్లాలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో అభ్యర్థుల కోసం ఐదు పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేశాం. గంట ముందుగానే పరీక్ష కేం ద్రంలోనికి అభ్యర్థులను అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించం. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి.
– బి.బాలస్వామి, మెదక్ జిల్లా అదనపు ఎస్పీ