శివ్వంపేట, మార్చి 11: నేరాలను అదుపుచేసేందుకు శివ్వంపేట పోలీసులు నడుంభిగించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నిఘానేత్రాలు నేరాలకు అడ్డుకట్టవేయడానికి దోహదపడుతున్నాయి. సీసీకెమెరాల ఏర్పాటుతో దొంగతనాలు, నేరాలు చేయడానికి దొంగలు భయపడుతున్నారు. మండలంలో పోలీసులు అవగాహన కల్పించడం వల్ల నవాబ్పేట, గూ డురు, ఉసిరికపల్లి, చండీ, శివ్వంపేట, బిజిలీపూర్ గ్రామా ల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఇటీవల నవాబ్పేట గ్రామంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి, ఏదుల్లాపూర్ గ్రామంలో కేహెచ్ఆర్ ట్రస్టు చైర్మన్, మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు రూ. 5లక్షలు సొంత ఖర్చులతో 21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి సీసీకెమెరాలను ప్రారంభించారు. తూప్రా న్ సీఐ శ్రీధర్, ఎస్సై రవికాంత్రావుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీకెమెరాల ఏర్పాటుకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వాటి ఉపయోగాలు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో అసాంఘీక కార్యకలాపాల నియంత్రణ, యు వత చెడు వ్యవసనాలకు గురికాకుండా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.
రూ. 5 లక్షల నిధులతో ఏర్పాటు చేశా..
తమ ఏదుల్లాపూర్ గ్రామం మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసుల అవగాహన, సూచనలతో గ్రామం మొత్తం రూ. 5 లక్షల సొంత ఖర్చులతో 21 హై క్వాలిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా. గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా నిఘానేత్రాలు 24గంటలు పనిచేసేలా అమర్చాం. గ్రామంతో పాటు మండలంలో ఇకముందు తన సేవలను విస్తరిస్తా.
–కల్లూరి హనుమంతరావు, కేహెచ్ఆర్ ట్రస్టు చైర్మన్, మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
నేరాల సంఖ్య తగ్గుతున్నది..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందు కు వస్తున్నారు. ఇప్పటివరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, దాతలు వీలైనంత త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వందశాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇతర మండలాలకు ఆదర్శంగా శివ్వంపేటను నిలిపేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలి.
–ఎస్సై రవికాంత్రావు, శివ్వంపేట