మున్సిపాలిటీ, జనవరి 24 : కొత్తగా లే అవుట్లు, భవన నిర్మాణాలు చేపట్టే వాటికి 30 ఫీట్ల రోడ్డు, సెట్ బ్యాక్ ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులతోపాటు ఆన్యాక్రాంతం, అక్రమ నిర్మాణాలపై తీసుకోవాల్సిన చర్యలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మున్సిపల్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ అనుమతుల కావాల్సిన పత్రాలను వివరిస్తూ ఫ్ల్లెక్సీలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ప్రతి నెలా మొదటి వారంలో తహసీల్దార్ అధ్యక్షతన ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహిం చాలన్నారు.
సమావేశంలో భవన నిర్మాణ దరఖాస్తులను పరిశీలించి, టీఎస్ బీపాస్ మార్గదర్శకాల మేరకు సక్రమంగా ఉన్నాయా? లేదా? క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచిం చారు. ఒకవేళ అనుమతిని తిరస్కరించడానికి కారణాలను వివరించాలన్నారు. కొందరు నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారని.. ఇటువంటి నిర్మాణా లను పరిశీలించాలని సూచించారు. మున్సిపల్ ప్రాంతాల్లో భూముల అన్యాక్రాంతం, అక్రమ నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్ విచారణ చేసి, ఆర్ అండ్ బీ అధికారులకు నివేదిక ఇవ్వాలన్నారు. దర్యాప్తు తర్వాత నోటీసులు ఇచ్చి నిర్మా ణాలను తొలిగించాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్ల ప్రగతిని సమీక్షిస్తూ వందశాతం వసూళ్లే లక్ష్యంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోగా బకాయిలతో పాటు ప్రస్తుత పన్నులను వసూళ్లు చేసి నివేదికలు మర్పించాలని కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల అభివృద్ధి సుందరీకరణలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో పార్కులు, లైటింగ్ ఏర్పాటుకు డీపీఆర్లు రూపోందించి నివేదికలు పంపాలని చించారు. సమావేశంలో మున్సిపల్కమిషనర్లు జానకీరామ్సాగర్, మోహన్, వెంకట్గోపాల్, ఆర్అండ్బీ అధికారులు, పోలీసు, అగ్నిమాపక అధికారి పాల్గొన్నారు.