గులాబీ దండు కదిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నల్లగొండ జిల్లా కేంద్రం లో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివెళ్లగా.. కేసీఆర్ ప్రసంగం పార్టీ క్యాడర్లో జోష్ నింపింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి రెట్టింపు అయ్యిందన్నారు. రైతుల భూములకు అధిక ధరలు పలుకుతున్నాయని, పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులు రాజులు అయ్యారని, కాంగ్రెస్ సర్కారు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.