సీఎం కేసీఆర్కు అండగా నిలుద్దామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 2వవార్డు నర్సపురం, 3వవార్డు రంగధాంపల్లి, సిద్దిపేట అర్బన్ మండలం ఎస్సాన్పల్లిలో సోమవారం దసరా ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్నారు. సిద్దిపేటకు ట్యాగ్ లైన్ అయిన జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలును తెచ్చుకున్నామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు సౌకర్యం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సిద్దిపేటను రిజర్వాయర్ల ఖిల్లాగా, విద్యా క్షేత్రంగా మార్చుకున్నామని చెప్పారు. అందరి ఆశీస్సులతో దశాబ్దాల కలలను నిజం చేసుకున్నామన్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 24: ‘తెలంగాణ పాలపిట్ట కేసీఆర్కు అండగా నిలుద్దాం.. కేసీఆర్ లేనిది తెలంగాణ లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దసరాను పురస్కరించుకొని సోమవారం సిద్దిపేట పట్టణంలోని 2వ వార్డు నర్సపురం, 3వ వార్డు రంగధాంపల్లి, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో పాల్గొని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలపిట్టను ఎగరవేశారు. రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రజలకు జంబిని పంచి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయదశమి ప్రతి ఒకరి జీవితాల్లో నూతన ఉత్సాహం తీసుకురావాలని భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు. గత దసరాకు అనుకున్నవిధంగా ఈ సంవత్సరం రైలును తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేటకు ట్యాగ్ లైన్ అయిన జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలును తెచ్చుకున్నామన్నారు.
దశాబ్దకాలంగా నర్సపూర్ ఊర్లో దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. సిద్దిపేట దశాబ్దాల కలలను నిజం చేసుకుమన్నామని, రాబోయే రోజుల్లో సిద్దిపేట నుంచి తిరుపతి బెంగళూరుకు రైలు సౌకర్యం కల్పిస్తామన్నారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందన్నారు. పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేద్దాం మన పాలపిట్ట సీఎం కేసీఆర్కు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. దేవాలయాలు, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేటను మార్చుకున్నామని చెప్పారు. వచ్చే బతుకమ్మ నాటికి సిద్దిపేట కోమటిచెరువు వద్ద ఆర్టిఫిషియల్ బీచ్, శిల్పారామం ప్రారంభించుకుంటామన్నారు. సిద్దిపేట విద్యా క్షేత్రంగా మారిందన్నారు. దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు తంజీమ్ ఉల్ మజీద్ ఉచితంగా తాగునీటిని సరఫరా చేసి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా ఆధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, అర్బన్మండల వైస్ ఎంపీపీ ఎల్లం, కౌన్సిలర్లు నాయిని చంద్రం, వంగ రేణుకాతిరుమల్రెడ్డి, ఎన్సాన్పల్లి సర్పంచ్ బీఆర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఉమరాణీఐలయ్య, మాజీ సర్పంచ్ ముత్యాల కనకయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దసరా పండును పురస్కరించుకోని మంత్రి హరీశ్రావు సిద్దిపేట పట్టణంలోని కోటి లింగాల ఆలయంలో స్వామివారిని దర్శించుకొని జంబి పూజ చేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలోని దాసాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట రేణుకాఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేశారు. పట్టణంలోని 15 వార్డు ఇమాంబాద్లో హిందువాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఆమ్మవారిని దర్శించుకున్నారు. యువసేన యూత్ ఆధ్వర్యంలో ఆమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ పాతురి శ్రీనివాస్రెడ్డి, నాయకులు రెడ్డి ప్రభాకర్రెడ్డి, పల్లె బాలకిషన్ గౌడ్ పాల్గొన్నారు.