జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా అందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్లో మంగళవారం సాయంత్రం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్, కేసీఆర్ను విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.