చిలిపిచెడ్/కొల్చారం/ నర్సాపూర్/వెల్దుర్తి, నవంబర్ 27: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సుపరిపాలన సాధ్యమని, కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చిలిపిచెడ్ మండలంలోని గౌతాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ యువకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో సునీతాలక్ష్మారెడ్డి సమీక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీఆర్ఎస్కు సైనికులాంటి కార్యకర్తలు నర్సాపూర్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరించాలని సూచించారు. అన్నివర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో మన్నే అశోక్, మన్నే యాదగిరి, హన్మంత్, ప్రవీణ్, మధుసూదన్, శివకోటి, తలా రి ఎల్లం, బాలయ్య, మహేశ్, లక్ష్మణ్ తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, మాణిక్యరెడ్డి, నర్సింహారెడ్డి, విఠల్, శంకరయ్య, భీమయ్య, యాసీన్, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
* ప్రజలు కాంగ్రెస్ను నమ్మి మోసపోవద్దని మండల బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, అజ్జమర్రి సర్పంచ్ పరశురాంరెడ్డి, ఎంపీటీసీ మల్లయ్య కార్యకర్తలకు సూచించారు. సోమవారం చిలిపిచెడ్ మండలంలోని సోమక్కపేట, అజ్జమర్రి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి నర్సాపూర్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమం లో నాయకులు మధుసూదన్గౌడ్, శ్రీనివాస్గుప్తా, వీరాస్వామి, శేఖర్, పోచ య్య తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
* కొల్చారం మండలంలో బీఆర్ఎస్ ఇంటింటికీ ప్రచారం జోరుగా సాగుతున్నది. సోమవారం ఆయా గ్రామాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కొల్చారంలో నిర్వహించిన ఇంటింటికీ ప్రచారంలో గ్రామ రైతు బంధు కో ఆర్డినేటర్ గ్యాస్ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, ము త్యం ప్రవీణ్కుమార్, గ్రామ బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎనగండ్లలో జరిగిన ఇంటింటికీ ప్రచారంలో సర్పంచ్ వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సాయిబాబాగౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు
* నర్సాపూర్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. డమ్మీ ఈవీఎంతో కారు గుర్తును చూపిస్తు ఓటేయాలని ఓటర్లను బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యర్థిస్తున్నారు. సోమవారం మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్య ర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
* నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని సునీతారెడ్డి కోడలు రుత్వికారెడ్డి అన్నారు. సోమవా రం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ అనసూయ అశోక్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, బీఆర్ఎస్ నాయకులు బాల్రెడ్డి, నగేశ్, ఆంజనేయులుగౌడ్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
* వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు జోరుగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రమైన మాసాయిపేటలో సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి కోడలు కీర్తిశ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, సర్పంచ్ మధుసూదన్రెడ్డి, నాయకులు నాగరాజు, సిద్ధిరాములు, నర్సింలు, పవన్, రమేశ్, దుర్గపతిలతోపాటు నాయకులు ఈవీఎం నమూనా ఓటింగ్ యంత్రాన్ని చూపించి కారు గుర్తుకు ఓటు వేసి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. అలాగే వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఖాజా, కిష్టారెడ్డి, మైసయ్య, రామస్వామి, ప్రవీణ్లతో పాటు పలువురు నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.