మెదక్ రూరల్/మెదక్ మున్సిపాలిటీ/రామాయంపేట/ నిజాంపేట, నవంబర్ 19: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని హవేళీఘన్పూర్ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ మండలంలోని జక్కన్నపేటలో ఆదివారం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బూత్ స్థాయి నాయకులు ప్రతి ఓటరును కలిసి బీఆర్ఎస్కు ఎం దుకు ఓటు వేయాలో వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్గౌడ్, దుర్గరావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
* మెదక్ మండలంలోని తిమ్మనగర్లో ఆదివారం సర్పం చ్ లక్ష్మీ ఆంజనేయులుతో కలిసి మహిళలు ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ అభ్యర్ధి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
* మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితోనే మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మెదక్ మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ రాగి అశోక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 6వ వార్డులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మ్యానిఫెస్టో ప్రతులను ప్రజలకు పంపిణీ చేశారు. బీఆర్ఎస్కు ఓటేయ్యాలని అభ్యర్థించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరిస్తున్న పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం పద్మాదేవేందర్రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు సుధాకర్, మోచి కిషన్, సంగ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 15, 30 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, జెల్ల రమేశ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
* బీఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని జిల్లా లయన్సు క్లబ్ చైర్మన్, రామాయంపేట ఆరవ వార్డు కౌన్సిలర్ దేమె యాదగిరి ప్రజలను కోరారు. ఆదివారం రామాయంపేట పట్టణంలోని ఆరవ వార్డులో వీధివీధినా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మ్యాధరి కిషన్, బీర స్వామి, భాను, సంజీవ్, ఊర నరేశ్, బాలరాజు, స్వామి ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
* అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొమ్మాట బాబు అన్నారు. ఆదివారం పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిష్టారెడ్డితో కలిసి ఆయన మండల కేంద్రం నిజాంపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఎల్లం, తదితరులు ఉన్నారు.