రామాయంపేట/నిజాంపేట/చిన్నశంకరంపేట, నవంబర్ 15: రామాయంపేట పట్ట ణం నుంచి ‘ప్రజా ఆశీర్వాద సభ’కు భారీగా ప్రజలు తరలి వెళ్లారు. బుధవారం పట్టణంలోని కేసీఆర్ కాలనీ నుంచి బైక్ ర్యాలీతో పాటు మహిళలు వందలాదిగా తరలివెళ్లారు. పట్టణంలోని 12 వార్డుల నుంచి సుమా రు 150 వాహనాల్లో చైర్మన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో వందలాదిగా తరలివెళ్లారు. ఒక్క కేసీఆర్ కాలనీ నుంచి దాదాపు 500 మంది సీఎం సభకు తరలివెళ్లారు. వీరి వెంట రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, సరాఫ్ యాదగిరి, బాదె చంద్రం, గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, శ్యాంసుందర్, కొండల్రెడ్డి, చింతల యాదగిరి, బొర్ర అనిల్, చింతల రాములు, మర్కు దత్తు, శ్రీనువాస్ తదితరులు ఉన్నారు.
మెదక్లో బుధవారం సీఎం కేసీఆర్ హాజరైన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు నిజాంపేట మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను చూసేందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు చింతల స్వామి పేర్కొన్నారు.
మెదక్లో బుధవారం సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు పట్లోరి రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు, యువకులు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివెళ్లారు.