పటాన్చెరు/అమీన్ఫూర్, ఏప్రిల్ 9 : బీఆర్ఎస్ కంచుకోట పటాన్చెరు నియోజకవర్గం.. మాకు బలం- బలగం అంతా కార్యకర్తలేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్ఫూర్ మున్సిపాలిటీలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అమీన్ఫూర్ మండల మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సదస్సుకు పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. బీరంగూడ నుంచి అమీన్ఫూర్ వరకు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ తీసిన ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నది. భారీగా తీసిని ర్యాలీకి ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలకం అవబోతున్నదన్నారు. దాదాపు 60లక్షల మంది సభ్యత్వంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అజేయశక్తిగా నిలిచిందన్నారు. పార్టీ పటిష్టతకు వెన్నుముక్కగా నిలిచిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మద్య వారధిగా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. గత ప్రభుత్వాల హయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పల్లెలు ఇప్పుడు ప్రగతి పథంలో ముందుకు దూసుకొని వెళ్తున్నాయన్నారు.
పటాన్చెరు అభివృద్ధిలో ఆదర్శం..
పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందున్నదన్నారు. మున్సిపాలిటీలు కూడా అన్ని రంగాల్లో దూసుకొని వెళ్తున్నాయన్నారు. అమీన్ఫూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నదన్నారు. దాదా పు కోటి లీటర్ల కెపాసిటీ కలిగిన నాలుగు నీటి రిజర్వాయర్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. అమీన్పూర్ మం డలంలోని కిష్టారెడ్డిపేట్, పటేల్గూడతో పాటు అన్ని గ్రామాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. అభివృద్ధికి మారుపేరులా గ్రామాలు మారాయన్నారు. పదేండ్ల కింద ఉన్న గ్రామాలకు ఇప్పుడు అభివృద్ధి చెం దిన గ్రామాలకు తేడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నదన్నారు.
బీరంగూడ- కిష్టారెడ్డిపేట రోడ్డు పూర్తి చేశాం
బీరంగూడ- కిష్టారెడ్డి పేటకు వెళ్లే రోడ్డు నరకానికి ప్రతీగా ఉండేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రూ. 75 కోట్లు ఖర్చు చేసి చక్కటి రోడ్డును వేశామన్నారు. ఇప్పుడు ప్రజల రాకపోకలు సులభతరం అయ్యాయని తెలిపారు. పారిశుధ్యంలోను అమీన్ఫూర్ తిరుగులేని విధంగా అభివృద్ధి చెందిందన్నారు. తెల్లవారగానే మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సేవలు గుమ్మం ముందుకు వస్తున్నాయన్నా రు. ప్రజా సమస్యలను పక్షపాతం లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. 24గంటలు నాణ్యమైన కరెంట్ను అందిస్తున్నామన్నారు. లో ఓల్టేజీ సమస్యను తీర్చేందుకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. వేలాది మంది పేదలకు 58 జీవో, 59జీవో కింద ఇండ్లు క్రమబద్ధీకరించామని చెప్పారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాలో ఉన్న గరీబులకు పట్టాలుగా అందించామన్నారు. సంక్షేమ పథకాల్లోను పింఛన్లు భారీగా ఇస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్తోను లబ్ధ్దిపొందుతున్నారన్నారు. సమ్మేళనంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానం దం, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహాగౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బాల్రెడ్డి, మండలాధ్యక్షుడు ఈర్ల రాజు, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, కౌన్సిలర్లు కొల్లూ రు మల్లేశ్, కవిత శ్రీనివాస్రెడ్డి, కష్ణ, బిజిలిరాజు, రాజేశ్వరి, కల్పన, ఉపేందర్రెడ్డి, ప్రమోద్రెడ్డి, చంద్రకళా, కో-ఆప్షన్ సభ్యులు యూనూస్, తలారీ రాములు, చం ద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
అమీన్ఫూర్ అభివృద్ధితో ప్రజల్లో ఆనందం
అమీన్ఫూర్ మున్సిపాలిటీ అభివృద్ధితో ప్రజలు ఆనందంతో ఉన్నారు. వేగంగా విస్తరిస్తున్న కాలనీల్లో ఆ మేరకు సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అందజేస్తున్న నిధులు, అండ మాకు ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని బీఆర్ఎస్ పాలనలో అందజేస్తున్నాం. ప్రతి కాలనీ ఇప్పుడు అభివృద్ధికి మారుపేరుగా మారింది. ఇంకా గుర్తించిన పనులు పూర్తి చేస్తాం. కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎప్పుడు అండగా ఉంటారు.
-తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్