పటాన్చెరు, ఏప్రిల్ 19: గొల్ల, కురుమలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం తమదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గొల్ల, కురుమల సహకార సంఘం సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గొల్ల, కురుమల సంఘం తరఫున గొర్రె పిల్ల బహూకరించి, సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గొల్ల, కురుమల సంక్షేమం కోసం సబ్సిడీలో గొర్రెల పంపిణీ అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సబ్సిడీ గొర్రెల యూనిట్లు గొల్ల, కురుమలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయన్నారు. మార్కెట్లో మాంసం వినియోగం పెరుగుతున్నదన్నారు. నియోజకవర్గంలో 1509 మంది సభ్యులు సహకార సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారని, వీరిలో ఇప్పటి వరకు 500 మంది సబ్సిడీ మొత్తాన్ని స్వీకరించారన్నారు. 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన యూనిట్ ధర రూ.లక్ష 75 వేలని, దానికి సభ్యుడు చెల్లించాల్సింది రూ.43వేల 750 అని తెలిపారు. ప్రతి సభ్యుడికి రూ.లక్ష 31వేల 350ను సబ్సిడీగా అందిజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28లోపు వందశాతం చెల్లింపులు జరగాలని అధికారులకు ఆదేశించారు. గుమ్మడిదల, జిన్నారం మండలాల్లో గొర్రెలు మేపే సమయంలో అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య రాకుండా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ వసంతకుమారి, గొల్ల కురుమల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు నగేశ్, ఎంపీపీలు సుష్మాశ్రీ వేణుగోపాల్రెడ్డి, ప్రవీణ విజయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, సుప్రజా వెంకట్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, కార్పొరేటర్లు పుష్పానగేశ్, మెట్టు కుమార్యాదవ్, పటాన్చెరు వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, ఎంపీడీవోలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, బీ వెంకట్రెడ్డి, వెంకటేశ్గౌడ్, బాల్రెడ్డి పాల్గొన్నారు.