పటాన్చెరు, మార్చ్ 24 : ఇంటింటా సంక్షేమం, అభివృద్ధి అన్నట్టుగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రజలు కోరుకున్న పాలనను సీఎం కేసీఆర్ ప్రజలకు అందజేశారన్నారు. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తాను రాజీపడలేదన్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గం అభివృద్ధి చేశామన్నారు. పటాన్చెరు పట్టణం గతంలో ఎలా ఉండేది.? ఇప్పుడేలా ఉందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అభివృద్ధికి మారుపేరుగా పటాన్చెరు పట్టణం మారిందని గుర్తు చేశారు.
ఒక విజన్తో పటాన్చెరును అభివృద్ధి చేశానన్నారు. దాదాపుగా ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు కనిపిస్తారన్నారు. నేను చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు హాట్రిక్ విజయం పక్కా అని తెలిసి తమపై నిందలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉనికి కోసం కాంగ్రెస్, మతం పేరున బీజేపీలు అగ్గి రాజేందుకు చూస్తున్నాయని,గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో 170కి పైగా దేవాలయాలను నిర్మించానని ఎమ్మెల్యే తెలిపారు. మసీదులు, చర్చిలు, దర్గాలను కూడా నిర్మించి అన్ని మతాలను గౌరవించానన్నారు. పటాన్చెరులో చక్కటి రోడ్లు వేసుకున్నామన్నారు.
గునీటి ఎద్దడి లేకుండా చేశామన్నారు. అద్భుతమైన గాంధీ థీమ్ పార్క్లను ఏర్పాటు చేశామన్నారు. సాకీ చెరువు సుందరీకరణ చేస్తామని హామీనిచ్చారు. త్వరలోనే 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన పటాన్చెరులో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్లు, నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ ఎంపీపీ మక్బుల్, పార్టీ పట్టణాధ్యక్షుడు అఫ్జల్ అలీ, గూడెం యాదమ్మ, గూడెం మధుసూదన్రెడ్డి, షకీల్, తులసీదాస్, శ్రీధర్చారి, రాజన్సింగ్, సందేళ్ల ఆంజనేయులు, పాండు, కంకర శ్రీను, అజ్మత్, రాము, ధనరాజ్గౌడ్, ఎంజాల మాధవి, ధనరాజ్గౌడ్, అజ్మీరా బేగం తదితరులు పాల్గొన్నారు.