ఝరాసంగం, మార్చి 10: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. కల్యాణవేదికపై ఉత్సవమూర్తులను అర్చకులు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. కల్యాణంలో 79మంది దంపతులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు. రాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహించారు. మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ఆలయ మాజీ చైర్మన్ వెంకటేశం, ఎంపీటీసీలు రజినీప్రియ సంతోష్ పాటిల్, విజేందర్, ఈవో శశిధర్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.