ఐదో రోజూ కొనసాగిన కార్యక్రమాలు
విస్తృతంగా పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
చేర్యాలలో అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్
మర్కూక్లో పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
ఇంటింటికెళ్లి పారిశుధ్యంపై అవగాహన
గజ్వేల్, జూన్ 7 : గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి ముమ్మరంగా కొనసాగుతున్నది. మూడు రోజులుగా మున్సిపాలిటీలోని అన్ని వార్డులో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఆయా వార్డుల కౌన్సిలర్లు అధికారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను గుర్తించారు. అలాగే, ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ఇంట్లోని మరుగుదొడ్డిని వినియోగించడంతో పాటు తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని అవగాహన కల్పించారు.
మంగళవారం గజ్వేల్ పట్టణంలోని వార్డుల్లో పారిశుధ్య చర్యలను నిర్వహించారు. ఆఫీసర్స్ కాలనీలో కౌన్సిలర్ లక్ష్మీకిషన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ 4వ వార్డులో కౌన్సిలర్ అర్చన శివకుమార్ ఆధ్వర్యంలో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. 4వ వార్డులో పనులను మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ పరిశీలించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. 16వ వార్డులో కౌన్సిలర్ తలకొక్కుల భాగ్యలక్ష్మీదుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఖాళీ ప్రదేశాలు, రహదారులకు ఇరువైపులా కలుపు మొక్కలను తొలిగించారు. 8వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు.