చిన్నశంకరంపేట/మెదక్రూరల్/రామాయంపేట/నిజాం పేట, నవంబర్ 22: బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రూ.400లకే గ్యాస్ సిలిండర్, ‘సౌభాగ్యలక్ష్మీ’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ. 3000లు అందిస్తారని జడ్పీటీసీ పట్లోరి మాధవి అన్నారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డికి మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. శాలిపేటలో వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సర్పంచ్ పోచ య్య చెన్నాయపల్లి సర్పంచ్ బాలమణి నాగరాజు, చిన్నశంకరంపేటలో మాజీ సర్పంచ్ కుమార్గౌడ్, నాయకులు, కార్యకర్తలు గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తు కు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మండలంలోని గ్రామాల్లో సం బంధిత గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీటీసీ హేమ వెంకటేశం, హేమచంద్రన్, మహేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
* రుణమాఫీ, రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓట్ల ద్వారా బొందపెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫేస్టో వివరాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సింగిల్విండో చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ హేమ వెంకటేశం, నాయకులు మైనంపల్లి రాధాకృష్ణన్రావు, రమేశ్రావు తదితరులు ఉన్నారు.
* బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి చూసి ఓటేయ్యాలని మెదక్ పీఎసీఎస్ చైర్మన్ చిలుముల హనుమం త్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ మండలంలోని ర్యాలమడుగులో శనివారం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాశి నరేందర్రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, భిక్షపతికుమార్, రాజు , సాయిబాబా, వీరారెడ్డి, వీనీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* రామాయంపేట పురపాలికలోని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం రామాయంపేట పట్టణంలోని మూడో వార్డులో వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొమ్మిదో వార్డులో కౌన్సిలర్ దేవుని జయరాజు, 11వ వార్డులో చిలుక గంగాధర్, ఐదో వార్డులో చంద్రపు శోభ, ఏడో వార్డులో మల్యాల కవిత, ఆరో వార్డులో కౌన్సిలర్ దేమే యాదగిరి సేలూన్కు వెళ్లి ప్రచారం చేశారు. రామాయంపేటలో ఉదయం, సాయంత్రం గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఇమ్రాన్, భరత్, వెంకటి, యాదేశ్, స్వామి, రవి, నగేశ్, వెంకటేశ్వర్రావు, ఐలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
* తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ జడ్పీటీసీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని నందగోకుల్లో స్థానిక సర్పంచ్ బాల్నర్సవ్వ, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి విజయలక్ష్మి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని మెజార్టీతో గెలిపించాలని విజయలక్ష్మి ప్రజలను కోరారు. కార్యక్రమంలో నస్కల్ సర్పంచ్ కవిత, మాజీ సర్పంచ్ అనిత సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు ఉన్నారు.
* ఆత్మకమిటీ చైర్మన్ ఆంజగౌడ్ ఆధ్వర్యంలో మెదక్ మం డలంలోని శివాయిపల్లి, వెంకట పూర్, గుట్టకిందిపల్లి పలు గ్రామాల్లో బుధవారం ప్రచారంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు కిష్టయ్యలో కలిసి ఆయన ఓటర్లను కోరా రు. కార్యక్రమంలో మెదక్ పీఎసీఎస్ డైరక్టర్ ఇందాద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు శివాయిపల్లి రవి పాల్గొన్నారు.