పాపన్నపేట, ఆగస్టు 10 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామ సర్పంచ్ ధారబోయిన మల్లేశం కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. సర్పంచ్ మల్లేశం తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మల్లేశంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, మల్లేశం కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి,కొడపాక సర్పంచ్ పంకజ కాశీనాథ్ రావు
,మాజీ సర్పంచ్ లు శ్రీనాథ్ రావు, బద్రి. మల్లేశం,నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్ రెడ్డి, బాబా గౌడ్,అంతోని, శ్రీనివాస్ గౌడ్,మేడిశెట్టి రాము,దండం సామెల్, మల్లేశం చంద్రన్న తదితరులు ఉన్నారు.