గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల ముంగిటనే రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సజావుగా సేకరించింది. జిల్లాలో 416 కేంద్రాల ద్వారా 90,083 మంది రైతుల నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాల్లో రూ.746.71 కోట్లు జమచేసింది. ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధరతో తమ ఊరిలోనే అమ్మకాలు పూర్తయి పూర్తిస్థాయిలో డబ్బులు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే వానకాలం పంట పూర్తిగా కొనుగోలు చేశారు. దీంతో రైతులకు ఇటు ధాన్యం డబ్బులు, అటు రైతుబంధు పైసలు పడడంతో ఖుషీఖుఫీగా యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. ధాన్యం సేకరణ ముగియడంతో కొనుగోలు కేంద్రాలను యంత్రాంగం మూసివేంది.
సిద్దిపేట, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. వానకాలం పంటను మొత్తం కొనుగోలు చేయడంతో జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. జిల్లాలో వానకాలంలో 90,083 మంది రైతుల వద్ద నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.746.71 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఎలాంటి తరుగు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేశారు. దీంతో రైతులకు ధాన్యం, రైతుబంధు డబ్బులు పడడంతో యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను చివరిగింజ వరకూ కొనుగోలు చేసి ఇటీవల అన్ని కేంద్రాలను మూసివేశారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 221 కేంద్రాలను ఏర్పాటు చేసి 48,034 మంది రైతుల వద్ద నుంచి 1,90,861 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.393.17కోట్లు జమ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల ద్వారా 190 కేంద్రాలను ఏర్పాటు చేసి 40,599 మంది రైతుల వద్ద నుంచి 1,65,458 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.340.84 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. మెప్మా ద్వారా జిల్లాలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 1450 మంది రైతుల నుంచి 6,159 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.12.69 కోట్లు జమ చేశారు. మొత్తం జిల్లాలో 416 కొనుగోలు కేంద్రాల ద్వారా 90,083 మంది రైతుల వద్ద నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసి నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాం కు ఖాతాల్లో రూ.746.71కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఏ రైతుకు రూపాయి బకాయి లేకుండా నిర్దేశిత సమయంలో అందరి రైతుల ఖాతాల్లో పంట కొనుగోలు డబ్బులు పడడంతో రైతులు ఖుషీ ఖుషీగా ఉన్నారు.
రైతులకు మద్దతు ధర
వానకాలంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏ-గ్రేడు ధాన్యాన్ని రూ.2060, బీ-గ్రేడ్ ధాన్యాన్ని రూ.2040గా ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి పంట పెట్టుబడి వరకు రైతులకు ప్రభుత్వం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడి సాయం, సాగునీరు, నిరంతరంగా విద్యుత్ను అందించడంతో భూమికి బరువయ్యేలా జిల్లాలో పంటలు పండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులపై మెండివైఖరి అవలంభిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలిచింది. ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది.
ధాన్యం కొనుగోలుపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ దిశానిర్దేశం చేయడంతో నిర్దేశిత సమయంలో పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించడంతో పాటు, కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేసి ట్యాగింగ్ చేసిన మిల్లులకు లారీల ద్వారా ధాన్యాన్ని తరలించి, ట్రక్ షీట్ వచ్చిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకున్నారు. ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశారు.