పుల్కల్, జూలై 15 : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 24.123 టీఎంసీల నీరు ఉందని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు వెల్లడించారు. ప్రాజెక్టులోకి 17,807 క్యూసెక్కుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 400 క్యూసెక్కులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ప్రతి మూడు గంటలకు ఓసారి వరద తీవ్రత పెరుగుతున్నట్లు తెలిపారు. వరద తీవ్రత పెరిగితే మరో మూడు నాలుగు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే గేట్లు ఎత్తుతామన్నారు. పైఅధికారుల సూచనల మేరకు వరద తీవ్రతపై జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నామని డిప్యూటీ ఈఈ తెలిపారు.ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న పరిసర ప్రాంతాల రైతులు మోటార్లు బిగించి ఉంటే వెంటనే తీసివేయాలన్నారు.ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అప్పటికప్పుడు బోరు మోటార్లు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి, రైతులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిని తీసి వేయాలని కోరారు. లేదంటే రైతులు నష్టపోయే అవకాశాలు ఉంటాయని డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు.
డ్యామ్ వద్ద వేడివేడిగా పర్యాటకులకు వంటకాలు చేస్తున్న హోటల్వాలా