మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట/ నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్/ హవేళీఘనపూర్/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట, జనవరి 3 : సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం కంటి వెలుగు కార్యకమాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రం మెదక్లో 12వ వార్డులోని వడ్డెర కాలనీలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబి రాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి కంటి సమస్యలు దూరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో సారి కొనసాగిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సమీయొద్దీన్, కో ఆప్షన్ సభ్యుడు ఉమర్, పీహెచ్సీ వైద్యుడు మణికంఠ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
లక్ష్మాపూర్లో కంటివెలుగు : ఎంపీడీవో ఉమాదేవి
రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఎంపీడీవో ఉమాదేవి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో గిరిజారాణి, సర్పంచ్ కాసుల దుర్గమ్మ, ఉప సర్పంచ్ ఎంపీటీసీ నాగులు ఉన్నారు.
పర్యవేక్షించిన ప్రత్యేకాధికారి విజయలక్ష్మి
హవేళీఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్, వైద్యసిబ్బంది, పంచాయతీ సెక్రటరీ లింగం, మదన్ ఉన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయాలి
నర్సాపూర్ మండలం అచ్చంపేట్లో కంటి వెలుగు శిబిరా న్ని ఎంపీవో వైద్య శ్రీనివాస్ పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. కార్య క్రమంలో సర్పంచ్ సంగీత, ఆరోగ్య సిబ్బంది కృష్ణకుమార్, ఏఎన్ఎంలు స్వరూపరాణి, నాగమణి, రమ్య, అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఆశ వర్కర్ రాణి, కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.
ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ సువర్ణ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 153 మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది శైలేంద్ర, రవి, కిషన్, ఏఎన్ఎంలు సంగీత, లత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి
చిలిపిచెడ్ మండలంలోని చండూర్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో శశిప్రభ సందర్శించారు.కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి, కార్యదర్శి జితేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అంధత్వ నివారణకు సహకరించాలి
పెద్దశంకరంపేట మండలం కొత్తపేట గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని వైద్యాధికారి వికాస్ పరిశీలించారు. అంధ త్వ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సారిక, శ్రీహర్ష, సిబ్బంది సంపూర్ణ, నాగమణి, సంతోష, వెంకటేశ్, స్వప్న ఉన్నారు.
కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి
చిన్నశంకరంపేట మండల పరిధిలోని రుద్రారంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రవీణ్ పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ , ఉప సర్పంచ్ ప్రసాద్ పాల్గొన్నారు.