నర్సాపూర్, మార్చి 30: ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 29న ప్రచురితమైన ‘నీరులేక ఆరెకరాల్లో… నిలువునా ఎండిన పంట’ అనే కథనానికి వ్వవసాయాధికారులు స్పందించారు. శుక్రవారం మెదక్ జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ పెద్దచింతకుంట గ్రామాన్ని సందర్శించి నీటి వసతి లేక ఎండిపోయిన రైతు అయ్యవారి ధనుంజయ్ ఆరెకరాల వరి పొలాన్ని పరిశీలించారు.
జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ మాట్లాడుతూ.. రైతు ధనుంజయ్ పంట నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి బి.అనిల్కుమార్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లావణ్య, ఏఈవో శిరీష, మాజీ సర్పంచ్ శివకుమార్ తదితరులు ఉన్నారు.