ప్రజల కల సాకారమైంది. పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట కొత్త మండలంగా ఇటీవల అవతరించింది. ప్రస్తుతం జిల్లాలో 27 మండలాలు ఉండగా.. నారాయణఖేడ్, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల్లోని మొత్తం 17 పంచాయతీలను కలిపి నిజాంపేటను 28వ మండలంగా ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మరింత వేగంగా అమలై ప్రజలకు మేలు జరగనున్నది. శనివారం (నేడు) ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. స్థానికులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-నారాయణఖేడ్, డిసెంబర్ 2
నారాయణఖేడ్, డిసెంబర్ 2: ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉనాయి. 28వ మండలంగా నారాయణఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ కేంద్రంగా మరో కొత్త మండలం అవతరించబోతున్నది. శనివారం రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు లాం ఛనంగా ప్రారంభించనున్నారు. నారాయణఖేడ్, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల్లోని మొత్తం 17 పంచాయతీలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కాగా, 26 వేల 105 మంది జనాభా నిజాంపేట్ మండల పరిధిలోకి రానున్నది. ఇప్పటికే నిజాంపేట్లో తహసీల్ కార్యాలయ భవానాన్ని ఏర్పాటు చేశారు. శనివారం మంత్రి హరీశ్రావు అధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే సిర్గాపూర్, నాగల్గిద్దలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. తాజాగా నియోజకవర్గంలో నిజాంపేట్ కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 28న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనూరు, పెద్దశంకరంపేటతో పాటు మూడు కొత్త మండలాలతో మొత్తం ఎనిమిది మండలాలయ్యాయి.
ఫిబ్రవరి 21వ తేదీన బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కోసం నారాయణఖేడ్కు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిజాంపేట్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా శనివారం దానికి కార్యరూపం దాల్చనున్నది. ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా మండల కేంద్రం కోసం ఎక్కని గడప లేదు, మొక్కని గుడి లేదు అన్న చందంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి టీఆర్ఎస్ ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. 161 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నిజాంపేట్తో పాటు మండలంలోని పలు గ్రామాలు మండల ఏర్పాటుతో శరవేంగంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాల కోరిక మేరకు నిజాంపేట్ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. సమైఖ్య రాష్ట్రంలో మండల ఏర్పాటు విషయంలో మా నిజాంపేట్ గ్రామస్తులు చుట్టుపక్కల వారితో కలిసి ఎన్నో సార్లు వినతి పత్రాలు సమర్పించాం. అవకాశం వచ్చినప్పుడల్లా మండల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాం. కాని అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారం, మా ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి చేసిన కృషి ఫలితంగా మండలం ఏర్పాటైంది. దీనికి మేము ఎప్పుడూ వారికి రుణపడి ఉంటాం.
– జగదీశ్వర్చారి, నిజాంపేట్, సర్పంచ్