పటాన్చెరు, సెప్టెంబర్ 4: దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో దివ్యాంగుల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దివ్యాంగులు నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. తెలంగాణ ఏర్పడడంతో సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ రూ.500ల నుంచి రూ.4016లు పెంచి అందజేస్తున్నారన్నారు. దీంతో ప్రతి దివ్యాంగుడికి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. మేలు చేస్తున్న బీఆర్ఎస్ను మరవద్దు అన్నారు.
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 3వందల మంది దివ్యాంగులకు స్కూటీలను ఉచితంగా ఇచ్చామని గుర్తుచేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లోను ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు, ఎంపీపీలు దేవానందం, ప్రవీణా విజయ్భాస్కర్, జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, సుప్రజా వెంకట్రెడ్డి, కుమార్గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, రోజా బాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, సింధు ఆదర్శ్రెడ్డి, పుష్పా నగేశ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్గౌడ్, వివిధ శాఖల అధికారులు, నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.