సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్ మీదుగా తిరుపతి, బెంగళూరు వరకు రైళ్లు ప్రారంభించడంతో పాటు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైల్వే పెండింగ్ పనులపై బుధవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కలిశారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వేలైన్ను ఈనెల 15న రైల్వేసేఫ్టీ కమిషనర్ తనిఖీ పూర్తికాగానే ప్యాసింజర్ రైళ్లు, హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు పుష్పుల్ రైలు ప్రత్యేకంగా ప్రారంభించాలని కోరారు. జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త రైల్వేస్టేషన్ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, ఎదులనాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్, మెదక్ జిల్లాలోని మాసాయిపేట్ రైల్వే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయగా, రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారు.
– సిద్దిపేట,సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరు వరకు రైళ్లు ప్రారంభించడంతో పాటు ప్యాసింజర్ రైలు నడపాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు, బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైల్వే పెండింగ్ పనుల అంశంపై సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వే లైన్ ఈ నెల 15న రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలన పూర్తి కాగానే, ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు పుష్ పుల్ రైలును ప్రత్యేకంగా ప్రారంభించాలన్నారు. జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద కొత్త రైల్వేస్టేషన్ పనులు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు, ఏదులనాగులపల్లిలో గూడ్స్ టెర్మినల్, మెదక్ జిల్లాలోని మాసాయిపేట్ రైల్వే పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. దేశ చరిత్రలోనే అత్యంత త్వరగా సిద్దిపేట రైల్వే లైన్ పూర్తి అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూ సేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించడం వల్లనే సాధ్యమైందని మంత్రి తెలిపారు.
దేశంలో మొట్టమొదటిసారి ఒక కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగామన్నారు. తెలంగాణలో నిర్మించనున్న ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్ట్లో మెదక్, సిద్దిపేటను కలపాలని మంత్రి కోరారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో ఔటర్ రింగ్ రైల్వే లైన్ను మెదక్, సిద్దిపేట మీదుగా నిర్మించాలన్నారు. రూ. 250 కోట్లతో 2 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేసి రైల్వేశాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.315 కోట్లు కూడా సమయానికి విడుదల చేయడం వల్ల సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయ్యిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. చేగుంట-మెదక్ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి జీఎంను కోరారు. అన్ని విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రతిపాదనలను వెంటనే రైల్వే బోర్డుకి పంపిస్తానన్నారు. ఈ క్రమంలో రైల్వే బోర్డుని కూడా త్వరలో కలువనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో నాడు ఎన్నికల నినాదాలుగా మిగిలిపోయిన వాటిని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా అన్ని నెరవేర్చారు. ఇవ్వాళ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరు తెచ్చుకున్నాం. ఇవ్వాళ సిద్దిపేట రైలు కల కూడా సాకారం కాబోతున్నది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో ఇవన్నీ పూర్తవుతున్నాయి. సిద్దిపేట వాసులు ఎదురుచూస్తున్న రైలు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే మంత్రి హరీశ్రావు రైలు ట్రయల్ రన్కు జెండా ఊపారు. ఈనెల 15న కొత్తగా నిర్మించిన సిద్దిపేట రైల్వేలైన్ను రైల్వేసేఫ్టీ కమిషనర్ పరిశీలన చేయనున్నారు.ఈ ప్రక్రియ పూర్తి కాగానే ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించేలా మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సిద్దిపేట శివారులోని నర్సాపూర్, కేసీఆర్ నగర్ కాలనీ సమీపంలో ఈ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి.
మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణ, భూసేకరణ, ఇతర సమస్యలపై ఎప్పటికప్పడు అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల్లో వేగాన్ని పెంచారు. స్టేషన్ వద్ద ట్రాక్, సీసీ తదితర పనులు పూర్తి దశకు వచ్చాయి. ఇక్కడ ఐదు ట్రాక్లైన్లలో మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, 4వ లైన్లో గూడ్స్ రైళ్లు, 5వ లైన్లో ప్యాకింగ్, మరమ్మతులు, ఇంజిన్ల సైడింగ్ కోసం వినియోగిస్తారు. ఇక్కడనే గూడ్స్ షెడ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. తొలి దశలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ వరకు రైలు నడపడానికి రైల్వే సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు.
ఇప్నటికే హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు రైలు సేవలు ప్రారంభమై రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు ద్వారాఎరువులను తీసుకువచ్చి జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నారు.దీంతో ఎరువులను తీసుకురావడానికి సనత్నగర్ రేక్ పాయింట్కు వెళ్లాల్సిన శ్రమ తగ్గింది. సిద్దిపేట నుంచి కాచీగూడ రైల్వే స్టేషన్ వరకు రెగ్యులర్ రైలు నడపనున్నారు. దీనితో పాటు తిరుపతి, బెంగళూరు ప్రాంతాలకు రైలు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం మెదక్ జిల్లాలో 9.30 కి.మీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీటర్లు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కి.మీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కి.మీటర్ల మేర మొత్తం 151.36 కి.మీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తున్నారు. నాలుగు జిల్లాలో మొత్తం 15 రైల్వేస్టేషన్లు నిర్మిస్తున్నారు.
రైల్వేసౌకర్యంతో మరింతగా అభివృద్ధి
దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కల సాకారం కానుండడంతో ప్రజల్లో వ్యక్తమవుతున్నది. రైల్వే సౌకర్యం ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనున్నది. ఎంతోమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే రైల్వేలైన్ పెద్దపల్లి వద్ద కలుస్తుంది. దీంతో కలకత్తా, న్యూఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. మనోహరాబాద్ నుంచి ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు. ఈ రైల్వేలైన్ నిర్మాణంతో మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది.ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే రైల్వేలైన్ అని చెప్పవచ్చు. వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలు ఉన్నాయి. గజ్వేల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. కాలుష్య రహిత పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణాలు జరిగాయి. భవిష్యత్లో మంచి పర్యాటక ప్రాంతం కానున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ ఉన్నది. ఇక్కడికి సుమారుగా 30 కి.మీ దూరంలో కొండపోచమ్మ దేవాలయం ఉంది.
ఈ దేవాలయం పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అక్కడి నుంచి మరో 25 కి.మీ దూరంలో భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న ఆలయం ఉంది. ఇక్కడికి రా్రష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల భక్తులు తరలివస్తారు. మల్లన్నను దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మ ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు వెళ్లవచ్చు. ఇక ఉత్తర తెలంగాణ వరప్రదాయి కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మల్లన్న వనాల పేరుతో మంచి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తున్నారు.