నర్సాపూర్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ నర్సాపూర్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, పండుటాకులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్సక్సెస్ అయ్యింది.
సభకు సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. సభలో జై తెలంగాణ.. జైకేసీఆర్ నినాదాలు మార్మోగాయి. కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. ‘గులాబీల జెండలే రామక్క’ పాట సభలో ఊపును తెచ్చింది. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆ పాటకు కాసేపు కాలు కదిపి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను ఉత్సాహపరిచారు.
నర్సాపూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఇర్ఫాన్ అలీ బీఆర్ఎస్ జెండాతో క్రేన్ పైకి ఎక్కి జైతెలంగాణ అంటూ నినాదాలు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్తో సభా ప్రాంగణాన్ని చుట్టేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు జైతెలంగాణ, జైబీఆర్ఎస్ అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు.