పెద్దశంకరంపేట/ మెదక్ రూరల్/ చిలిపిచెడ్, మే 20 : పెద్దశంకరంపేట మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రం, బుజ్రాన్పల్లి గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు దాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. అనంతరం బుజ్రాన్పల్లి గ్రామానికి చెందిన మల్లయ్యకు రూ. 12 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఆయా కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ఎంపీపీ లక్ష్మీరమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కోనం సువర్ణాఅంజయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, ఎంపీటీసీ సుభాశ్గౌడ్, సర్పంచ్లు రాములు, శంకర్గౌడ్, రవీందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఏఈవో రాజశేఖర్ పరిశీలించి, నిర్వాహకులు పలు సూచనలు చేశారు. చిట్యాల గ్రామంలోని కొనుగోలు కేంద్రా న్ని ఏవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయడానికి పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, సాధారణ ధాన్యానికి రూ.2040 మద్దతు ధర ప్రభు త్వం ప్రకటించిందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. 17శాతం తేమ మించకుండా ఎఫ్సీఐ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తీసుకురావాలని సూ చించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే ట్యాంగిగ్ చేసి, లారీల్లో మిల్లులకు తరలించాలన్నారు. ట్రక్షీట్ వచ్చినా వెం టనే ట్యాబ్ఎంట్రీ చేసి రైతు ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. తూకాల్లో మోసాలు, కాంటా వేసిన బస్లాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు.
చిలిపిచెడ్ మండలం సోమక్కపేట గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల ప్రత్యేక అధికారి మహ్మద్ ఖాసీం, శీలంపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో శశిప్రభ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమశాతం పరిశీలించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. లారీల కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏవో బాల్రెడ్డి, ఏపీఎం ప్రేమలత, ఏపీవో శ్యామ్కుమార్, సీసీ పురుషోత్తం, ఏఈవోలు భూపాల్, రమ్య పాల్గొన్నారు.
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం తగదు..
వెల్దుర్తి, మే 20: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తర లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. మాసాయిపేట మండల కేంద్రం లోని వెంకటసాయి రైస్మిల్లును డీఎస్వో శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైస్మిల్లులో రికార్డులను తనిఖీ చేశారు. రైస్మిల్లుకు వచ్చిన ధాన్యం అన్లోడింగ్, బియ్యం సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం తరలిం పు, వాహనాల ఏర్పాటుపై తహసీల్దార్ మాలతిని వివరాలు అడిగారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు ము మ్మరం చేయాలని, లారీల్లో వెంటవెంటనే ధాన్యం తరలించాలని సూచించారు. రైస్మిల్లుల యజమానులు వచ్చిన ధాన్యా న్ని వెంటవెంటనే అన్లోడింగ్ చేసుకోవాలన్నారు.