సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గురువారం రంజాన్ పండుగను ముస్లింలు ఘంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ముస్లింలందరూ నూతన వస్ర్తాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలు చోట్ల రంజాన్ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.