నర్సాపూర్/ రామాయంపేట/ మనోహరాబాద్/ వెల్దుర్తి, జూన్ 7 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా గురువారం నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలోని రాయారావు చెరువు వద్ద ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడు తూ.. చెరువల పండుగలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి రాయారావు చెరువు వరకు బతుకమ్మ, బోనాల ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం కట్ట మైసమ్మ ఆల యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది, అధికారులు ఉన్నారు.
మున్సిపల్స్థాయి అధికారులతో సమావేశం
రామాయంపేటలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఇన్చార్జి కమిషనర్ ఉమాదేవి పిలుపునిచ్చారు. మున్సిపల్ పాలకవర్గం తో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, చెరువుల పండుగ ఏర్పాట్లపై చర్చించారు. రామాయంపేటలోని మల్లె చెరువు వద్ద చెరువు పండుగ నిర్వహిస్తామన్నారు. చెరువు పండుగ సందర్భంగా వెయ్యి మందికి భోజనాలను సిద్ధ్దం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా లోపాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు. మల్లె చెరువు వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు. సమావేశంలో మేనేజర్ శ్రీనివాస్, రిసోర్స్పర్సన్లు ఉన్నారు.
ఊరూరా పండుగను విజయవంతం చేయాలి
మనోహరాబాద్ మండలంలలో ఊరూరా చెరువు పండుగను విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో వారు మాట్లాడుతూ… ముదిరాజ్ సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చి, కాళేశ్వరంతో చెరువులను నింపి వ్యవసాయానికి సాగు నీరు, మత్స్యసంపద వృద్ధికి కృషి చేశారన్నారు. ముదిరాజ్లకు లైసెన్సులు, చెరువులపై హక్కులు, ఉచితంగా చేపపిల్లలు, సబ్సిడీపై వా హనాలు, రూ. 5 లక్షల ప్రమాదబీమా కల్పించారని కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించే చెరువు పండుగను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, పంజా భిక్షపతి ముదిరాజ్, మండలాధ్యక్షుడు దాసరి నరేశ్ ముదిరాజ్, సర్పంచ్ నాగభూషణం పాల్గొన్నారు.
చెరువుల పండుగకు సర్వం సిద్ధ్దం..
వెల్దుర్తి మండలంలో చెరువుల పండుగకు ప్రజాప్రతినిధు లు, అధికారులు సర్వం సిద్ధ్దం చేశారు. ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మలు, బోనాలు, గంగపుత్రుల ఊరేగింపు ఉంటుంద న్నారు. గ్రామాల్లో ఊరేగింపు వెళ్లి చెరువుల వద్దకు చేరుకో వాలన్నారు. చెరువుల వద్ద సర్పంచ్లు, ప్రత్యేక అధికారుల సమక్షంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వెల్దుర్తి, మాసాయిపేటమండలకేంద్రాల్లోని దేవతల చెరువు, రామప్ప చెరువుల వద్ద ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.