చేగుంట, నవంబర్ 3: దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లు, స్థానికులు మండల ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం చేగుంట మండలంలోని పోతాన్పల్లి, మక్కరాజిపేట తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్తోపాటు పలువురు మండల, గ్రామ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో 9 ఏండ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. వృద్ధులకు వృద్ధాప్య పింఛన్, వితంతువులు, బీడీ కార్మికులకు ఇస్తున్న రూ.2016 పింఛన్ను రూ.5016కు పెంచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేల రైతుబంధును రూ.16వేల వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం, కేసీఆర్ బీమా ఇంటింటికీ ధీమా, గృహలక్ష్మీ వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు.
గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, వృద్ధులు మాట్లాడుతూ కేసీఆర్ సారు సల్లంగుండాలి, సారు కారు తప్ప ఎవరికీ ఓటేయమని తెలిపారు. కొత్త ప్రభాకర్రెడ్డి సారు మా బిడ్డకు లక్షా రూపాయల కల్యాణలక్ష్మి ఇచ్చిండు.. అన్న దవాఖానల నుంచి త్వరగా కొలుకోవాలని దేవుడుకి దండం పెడుతున్న.. అని ఓ మహిళ ప్రచారానికి వెళ్లి నాయకులకు తెలిపింది. నాయకులు ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేసి కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో స్థానిక సర్పంచ్ కారింగుల సంతోషా సిద్దిరెడ్డి, తీగుళ్ల వేణుగోపాల్శర్మ, నాయిని రాజ్గోపాల్, పట్నం తానీషా, సర్పంచులు బుడ్డ స్వర్ణలతా భాగ్యరాజ్, వడ్డెపల్లి తిరుమల నర్సింహులు, కొటారి అశోక్, ఉప సర్పంచ్ సంతోష్కుమార్, డైరెక్టర్ గూళ్ల సిద్దిరాములు, మహ్మద్ అలీ, ఎర్ర యాదగిరి, ఊరడి యాదగిరి, లక్ష్మణ్, అన్నం రవి, మక్కరాజిపేటలో ఎంపీటీసీ బండి కవిత విశ్వేశ్వర్, మాజీ ఎంపీటీసీ బాల్నర్సింహులు, యాదవరెడ్డి, రాజిరెడ్డి, బాబురావు, మైనార్టీ నాయకులతోపాటు బీఆర్ఎస్ నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.