దుబ్బాక, జనవరి 19 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. రెండో విడత కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో కనుల పండువగా సాగింది. గురువారం దుబ్బాక పట్టణంతో పాటు అన్ని మండలాల్లో కంటి వెలుగు శిబిరాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరాల ఎదుట రంగవల్లులు, గుమ్మాలకు తోరణాలతో అలంకరించారు. దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం చిన్ననిజాంపేటలో మెదక్ ఎంపీ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. దుబ్బాక మండలంలో ఆకారం, అప్పనపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే రఘునందన్రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీతో కలిసి ప్రారంభించారు. దుబ్బాక పట్టణంలోని 16వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేశ్రెడ్డి ప్రారంభించారు.
కంటి వెలుగు శిబిరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి, కంటి పరీక్షలు చేయించుకున్నారు. శిబిరాల వద్ద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు. కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంగా మారిందని గ్రామాల్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంగా మారిందన్నారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ఖమ్మంలో సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు ప్రశసించారన్నారు. పైసా ఖర్చు లేకుండా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి, కండ్ల అద్దాలు అందజేయడం అదృష్టంగా భావించారు. అనంతరం ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆకారం గ్రామంలో ప్రారంభించిన కంటి వెలుగు శిబిరంలో ఎమ్మెల్సీ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగపరచుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు కోరారు. కార్యక్రమంలో దు బ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలా శ్, ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతీకృష్ణ, ఎంపీడీవో భాస్కరాశర్మ, సర్పంచులు రచన, లక్ష్మి, నాగభూషణం, ఎంపీటీసీలు లక్ష్మీనారాగౌడ్, అంజమ్మ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.