జహీరాబాద్, మార్చి 19 : మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు వేస్తున్న దని ఆరోపించారు. జహీరాబాద్ పట్టణంలోని సుభాశ్ గంజ్లో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మా ట్లాడారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలు బతుక లేని స్థితికి తెచ్చిందన్నారు.
ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నదని మండి పడ్డారు. బీజేపీ ప్రభుత్వం కుల, మతాల మధ్య విభేదా లు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ‘బీజేపీకో హఠా వో-భారత్కో బచావో’ అనే నినాదంతో సీపీఐ ఆందోళనలు నిర్వహిస్తుందని తెలిపారు. పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీపై పోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్, ఇన్చార్జ్జి నర్సింహ, జహీరా బాద్ డివిజన్ కార్యదర్శి నర్సింహులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మొహినొద్దీన్, నాయకులు అజారోద్దీన్, అఫ్జల్మియా, మైనోద్దీన్, ఆనంద్, మైబూబ్, జహంగీర్, విశ్వనాథ్, మొగులయ్య పాల్గొన్నారు.