దుబ్బాక టౌన్, మార్చి 22: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంతో దుబ్బాక బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బస్స్టాండ్ వద్ద పటాకులు కాల్చి స్వీట్లుపంచుకున్నారు. జట్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆస యాదగిరి, బత్తు స్వామి, ఆస స్వామి, రేకుల కుంట మల్లిఖార్జునస్వామి ఆలయ చైర్మన్ రొట్టె రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానాల శ్రీనివాస్, నాయకులు కొత్త కిషన్రెడ్డి, మల్లేశంగౌడ్, పర్సకృష్ణ, పడాల నరేశ్, రాధామనోహర్రెడ్డి, ఇస్మాయిల్, పల్లె బోస్, నారాగౌడ్, ఇస్తారిగల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు, మార్చి 22: మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రామ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ వనితారవీందర్రెడ్డి అన్నా రు. శుక్రవారం చిన్నకోడూరులో వారు విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలను కలుపుకొని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం చేస్తామన్నారు.
నంగునూరు, మార్చి 22: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నంగునూరు మండల నాయకులు అన్నారు. మండలంలోని పాలమాకులలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలుపించేందుకు ప్రతి కార్యకర్త పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు మహిపాల్రెడ్డి, కోల రమేశ్గౌడ్, నాయకులు వేణు చక్రవర్తి, కుమార్,ఐలయ్య, వెంకటేశ్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.