పాపన్నపేట, మే15: ఇటీవల జరిగిన విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థిని దివ్య పాపన్నపేట మండలంలో టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు కోలోయిన ఆ విద్యార్థిని పై చదువులకు అండగానిలవాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి స్పందించారు.
సోమవారం హైదరాబాద్లో విద్యార్థిని దివ్యను ఎమ్మెల్సీ శాలువాతో సన్మానించి, రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించి అభినందించారు. ఆమె పై చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.