కోహీర్, ఏప్రిల్ 6: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చా రు. జహీరాబాద్ పట్టణంలో శనివారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, రూ.4వేల పింఛన్, మహిళలకు నెలనెలా రూ.2,500, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం, బాలికలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఆ పథకాలు పొందిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, రానివాళ్లు మాత్రం బీఆర్ఎస్కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. హామీలు అమలయ్యే వరకు కాంగ్రెసోళ్లను విడిచిపెట్టమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడితే వడ్డీతోసహ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రాణాలు ఇచ్చి కార్యకర్తలను కాపాడుకుంటామని భరోసా కల్పించారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం బీజేపీ చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. పెట్రోల్ రూ.100, గ్యాస్ సిలిండర్ రూ.350 నుంచి రూ. 1000కి పెంచిందని విమర్శించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్కుమార్ తెలంగాణ ఉద్యమకారుడని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్, బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్ ఇద్దరూ ఎన్నడూ జై తెలంగాణ అనలేదన్నారు. బీబీపాటిల్ రెండుసార్లు గెలిచినా లింగాయత్, ముదిరాజ్, యాదవులు, దళితులకు ఏమీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులను కొనడం మాత్రం పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని విమర్శించారు. జహీరాబాద్ డివిజన్ ఏర్పాటు, మొగుడంపల్లి మండలం ఏర్పాటు, నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమైందన్నారు.. ధాన్యానికి బోనస్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలన్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే హామీలు అమలుకావన్నారు. రేజింతల్ సిద్ది వినాయకుడి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతుండగా కరెంట్ కట్ అయింది. దీంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు నవ్వుకున్నారు.
మార్పు అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పా టు కోసం కేసీఆర్ ఎక్కని కొండ, మొక్కని దేవుడు లేడన్నారు. స్థానికులకే 95శాతం ఉద్యోగాలు లభించేందుకు కొత్త చట్టాలు తెచ్చారని కొనియాడారు. కాంగ్రెస్ మాత్రం అబద్ధాల మీదనే ప్రభుత్వాన్ని నడుపిస్తుందని, కాంగ్రెస్ను నమ్మితే నట్టేట మునుగుతామని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బెవరేజస్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, విద్యుత్ బోర్డు మాజీ చైర్మన్ దశరథ్రెడ్డి, జడ్పీటీసీ స్వప్నాభాస్కర్, రామకృష్ణారెడ్డి, గుండప్ప, రవికిరణ్, మోహన్, అనుసూజ, చెంగల్ రాజశేఖర్, నర్సింహలు, నారాయణ, రవికిరణ్, ఆనంద్, నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.