బెజ్జంకి, జనవరి 13 : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాం స్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. 13 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు మం జూరు కాగా, శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ప్రభు త్వం ఎల్వోసీ, సీఎం రిలీఫ్ఫండ్ అందిస్తూ అం డగా ఉంటున్నదన్నారు.
పేదలకు సీఎం రిలీఫ్ఫండ్ వరమన్నారు. ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతూ అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న అరుంధతి కల్యాణ మండప నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్గుప్తా, సంజీవరెడ్డి, శ్రీనివాస్, మొండయ్య, రాజేశం, తిరుపతిరెడ్డి, శేఖర్బాబు, రామలింగారెడ్డి, మోహన్, రాము, అమరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.