చేర్యాల, మార్చి 27: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని నాగపురి గ్రామ వేణుగోపాలస్వామి తిరు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ నివాస గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని గుర్తుచేశారు. వేణుగోపాలస్వామి ఆశీస్సులతో జనగామ, చేర్యాల ప్రాంతాల్లోని అన్ని గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం చేర్యాల ప్రాంత అధ్యక్షుడు శివగారి అంజయ్య, మల్లన్న ఆలయ మాజీ డైరెక్టర్ కొంగరి గిరిధర్, మాజీ సర్పంచ్ బండకింది సంతోషికరుణాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు భీమారాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు, జితేందర్రెడ్డి, ప్రజ్ఞాపురం నర్సింహులు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 27: బీరప్పస్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో కురుమ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీరప్ప(పెద్ద)పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కురుమ సంఘం పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ధూళిమిట్ట మండలంలోని కూటిగల్లో ఇటీవల మృతి చెందిన చెప్యాల శ్రీనివాస్, తిగుళ్ల రమేశ్ కుటుంబాలను జనగామ ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో చేర్యాల ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, బీఆర్ఎస్ ధూళిమిట్ట, మద్దూరు మండల శాఖల అధ్యక్షులు మంద యాదగిరి, మేక సంతోష్కుమార్, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం,కురుమ సంఘం ధూళిమిట్ట, చేర్యాల మండల అధ్యక్షులు బర్మ రాజమల్లయ్య, శెవల్ల రాజయ్య, ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి సాగర్, మాజీ సర్పంచ్లు బండి చంద్రయ్య, ముక్క కనకయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, రాంరెడ్డి, కురుమ సంఘం అధ్యక్షుడు మీస రామకిష్టయ్య, కురుమ సంఘం పెద్దలు, ఒగ్గు బీర్ల కళాకారులు పాల్గొన్నారు.