మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 7 : జిల్లా కేంద్రంలోని ప్రధానో రోడ్డులోని సెంట్రల్ లైటింగ్ను గురువారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, కిషోర్, అంజనేయలు, గాయత్రి, వసంత్రాజ్, డీఈ మహేశ్, ఏఈ సిద్ధేశ్వరి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు సంశాన్సందీప్, పురం వెంకటనారాయణ, మేటిశెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు.