మెదక్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని మెదక్ . 2014కు ముందు తెలంగాణ దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేదని, ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. సంక్షేమ రంగాల్లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రగతి రథం ఆగలేదన్నారు. సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు ఇది నిదర్శనమని చెప్పారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చ లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు పథకం గతంలో ఏ ప్రభుత్వం చేయ ని గొప్ప ఆలోచన అని చెప్పారు. అన్నదాతలపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు రైతుబంధు నిదర్శనమన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుతో ఎస్సీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని చెరువులు, జలాశయాలు మత్స్య సంపదతో కళకళలాడుతున్నాయన్నారు. సరారు సూళ్లను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. కంటివెలుగు అద్భుతమైన కార్యక్రమమని, మొదటి విడత మంచి ఫలితాలనిచ్చిందన్నారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వనందుకు కేంద్రం సిగ్గుపడాలని విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ముఖచిత్రాలు మారిపోయాయని చెప్పారు. పల్లె ప్రగతికి అవార్డులిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిధులివ్వడానికి చేతులు మాత్రం రావని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీ రంగం ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తుందంటే ఆ ఘనత కేసీఆర్ సరారుదేనన్నారు. ఆర్అండ్బీ శాఖలో హౌసింగ్ శాఖను విలీనం చేయడం హర్షనీయమన్నారు.