మెదక్, మే 16 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతినెలా 2, 16 తేదీల్లో మెదక్లో అధికారులతో కలిసి క్యాం పు కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేంవేందర్రెడ్డి నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్ర మానికి మెదక్, పాపన్నపేట, నిజాంపేట, రామాయంపేట, శంకరంపేట, హవేళీఘనపూర్ మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, రెవెన్యూకు సంబందించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చా రు. మీకోసంలో వచ్చిన సమస్యలను అధికారులతో ఎమ్మెల్యే మా ట్లాడి పరిష్కరించారు. అందుబాటులో లేని అధికారులకు ఫోన్లో సమస్యలను వివరించి పరిష్కారం దిశగా కృషి చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్చైర్పర్సన్ లావణ్యా రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, కిశోర్, జయరాజ్, శ్రీనివాస్, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు కిష్టయ్య, బీఆర్ఎస్ హవేళీఘనపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, తహసీల్దార్ నవీన్కుమార్, మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్ పాల్గొన్నారు.