తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో కలెక్టర్ శరత్కుమార్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య మొక్కలు నాటారు. జోగిపేట, జహీరాబాద్లో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు స్థానికులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. మెదక్ నూతన కలెక్టరేట్ సముదాయం, నర్సాపూర్ పట్టణంలోని అర్బన్పార్కులో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా అటవీశాఖాధికారి రవి ప్రసాద్తో కలిసి మాస్ ప్లాంటేషన్లో పాల్గొని మొకలు నాటి నీళ్లు పోశారు. పలుచోట్ల మొక్కల పెంపకానికి ప్రత్యేక కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతలు ప్రదానం చేశారు.
– సంగారెడ్డి/మెదక్ న్యూస్నెట్వర్క్, జూన్ 19
ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ వినూత్న సంస్కరణలు తీసుకొచ్చారు. కేజీబీవీలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలను నెలకొల్పి కేజీ టు పీజీ వరకు ప్రభుత్వం ఉచిత విద్యను అమలుచేస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో ఆంగ్లంలో విద్యాబోధన చేయిస్తున్నది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నది. మనఊరు-మనబడి ద్వారా రూ.వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. దీనికి అనుసంధానంగా నర్సింగ్ కాలేజీని సైతం నిర్మిస్తున్నది. దేశంలోనే మొదటి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని జిల్లా కేంద్రంలో ప్రారంభించింది. అగ్రికల్చర్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. మనఊరు-మనబడి కింద మొదటి విడుతలో 441 పాఠశాలలను ఎంపిక చేసి తాగునీటి వసతి, ఫర్నిచర్, ప్రహరీలు, కిచెన్షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర 12 రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. మెదక్ జిల్లాలో మనఊరు-మనబడిలో భాగంగా తొలివిడుతలో 313 పాఠశాలల ఎంపిక చేసి అభివృద్ధి పనుల కోసం రూ. 130 కోట్లు మంజూరు చేసింది. 15 కేజీబీవీల్లో నాలుగింటిని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసింది.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ, జూన్ 19
మెదక్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): మానవ మనుగడకు మొక్కలు ఎంతో దోహదపడుతాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. అశోకుడి తర్వాత మొకలు నాటించడం, చెరువుల తవ్వకం లాంటి బృహత్తర కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లో హరితోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. పెద్ద ఎత్తున చేపట్టిన మాస్ ప్లాంటేషన్ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం విజయాలు గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిషరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక మనిషి ఆక్సిజన్ తీసుకోవడానికి 30 చెట్లు ఉంటే, మన దగ్గర 30 మందికి ఒక చెట్టు కూడా లేదన్నారు. భవిష్యత్తు తరాలు హాయిగా, ఆరోగ్యంగా జీవించడానికే సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి 8 విడతల్లో రాష్ట్రంలో 273 కోట్ల మొకలు నాటించారన్నారు. దీంతోపాటు, గ్రీన్ బడ్జెట్ కింది 10 శాతం నిధులు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. అడవుల పునర్జీవనానికి కృషి చేస్తుండడంతో తెలంగాణలో నేడు 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. ఇది దేశ చరిత్రలోనే రికార్డన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి: కలెక్టర్
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజన్, దార్శనికత, అటవీ శాఖ సాంకేతిక మార్గదర్శకాల మేరకు సూక్ష్మ ప్రణాళికతో పనిచేయడం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి భాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించుకున్నామన్నారు. 9వ విడత హరితహారంలో ప్రతిఒకరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డాన్స్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా అటవీ శాఖాధికారి రవిప్రసాద్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, జిల్లా అధికారులు శ్రీనివాస్, రాధాకిషన్, రాజిరెడ్డి, శంకర్, కృష్ణమూర్తి, విజయశేఖర్రెడ్డి, విజయలక్ష్మి, సుధాకర్, మెప్మా పీడీ ఇందిర, డీసీవో కరుణ, వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఎంపీపీ యమున, కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, కౌన్సిలర్లు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట, జూన్ 19: తెలంగాణలో హరితహారం పథకంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్లోని అర్బన్ పార్కులో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. మానవ మనుగడ కోసం చెట్లే ప్రాణాధారమని గ్రహించిన సీఎం కేసీఆర్ ప్రతిఒక్కరూ మొక్కలు నాటేలా గ్రామస్థాయి నుంచి చైతన్య పర్చి హరిత విప్లవం తీసుకొచ్చారన్నారు. హరితహారంలో పెట్టిన మొక్కలతో అటవీ సంపద పెరిగి, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు.
భూగర్భజలాలు సైతం పెరిగాయన్నారు. మొక్కలు నాటడం నిరంతర ప్రక్రియ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్లు రాజుయాదవ్, వెంకటరాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, కౌన్సిలర్ రాంచందర్, నాయకులు బోగ చంద్రశేఖర్, కుమ్మరి నగేశ్, పంబళ్ల భిక్షపతి, ఆంజనేయులుగౌడ్, రమణాగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, ఫారెస్టు రేంజ్ అధికారి అంబర్సింగ్, సెక్షన్ అధికారి సత్యనారాయణ, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్తో హరిత విప్లవం: సునీతారెడ్డి
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మొత్తం భూ భాగంలో 33 శాతం ఉండాల్సిన అడవులు పలు కారణాల రీత్యా క్షీణించాయని, సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా హరితహారం కార్యక్రమం చేపట్టి, 85 శాతం మొకలు బతికేలా అధికారులు, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేశారన్నారు. తద్వారా హరిత విప్లవ ఫలాలు సాధించామన్నారు.
యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలి
-నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి
నర్సాపూర్ శాసన సభ్యుడు మదన్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రి సిద్ధిపేటలో ఒకేరోజు 10 వేల మొకలు నాటి పచ్చదనానికి ఇస్తున్న ప్రాముఖ్యతను వివరించారన్నారు. అడవుల పరిరక్షణకు జిల్లా అటవీ అధికారులకు, కలెక్టర్లకు పూర్తి అధికారాలిచ్చారని తెలిపారు. మొకలు భవిష్యత్తు తరాలు ఆరోగ్యవంతంగా జీవించడానికి దోహదపడతాయని, ప్రతి ఒకరూ యుద్ధ ప్రాతిపదినక మొకలు నాటాలని పిలుపునిచ్చారు.