మెదక్ అర్బన్, జూలై01 : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల దగ్గర అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పతకాలతో సీఎం కేసీఆర్పేదింటి ఆడిబిడ్డలకు మేనమామగా మారాడని పేర్కొన్నారు. అలాగే రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, రైతు వేదిక నిర్మాణం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరిక అని తెలిపారు.
కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆత్మకమిటీ చైర్మన అంజాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్గౌడ్, కౌన్సిలర్లు నర్వ లక్ష్మి, వసంత్రాజ్, జయరాజ్, మెదక్ ఎంపీపీ యమున, పీఎసీఎస్ చైర్మన్ హనుమంత్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.