రామాయంపేట, నవంబర్ 16: రామాయంపేట పురపాలికలోని కేసీఆర్ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేట పురపాలికలోని మూడు, నాలుగు, ఐదు వార్డులతో పాటు కేసీఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కేసీఆర్ కాలనీకి చేరుకున్నారు. కాలనీలో ప్రజలు పద్మాదేవేందర్రెడ్డికి పూలవర్షం కురిపిస్తూ మహిళలు మంగళహారతులు సమర్పించి నుదిటిపై తిలకం దిద్దారు. జై పద్మాదేవేందర్రెడ్డి అంటూ యూత్ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రోడ్షో నిర్వహించారు. ఎమ్మెల్యే సైతం ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. అక్కడకు వచ్చిన వారంతా పేదలందరికీ కేసీఆర్ సారు ఇండ్లిచ్చిండు.. తాము కేసీఆర్ కారు గుర్తుకే ఓటేస్తామంటు తెలిపారు. అనంతరం పట్టణంలోని మూడు, నాల్గు, ఐదో వార్డుల్లో ప్రచారం చేశారు. బీసీ కాలనీలోకి పద్మాదేవేందర్రెడ్డి రావడంతోనే యువకులు వార్డు సభ్యులు గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చారు.
నాల్గవ, ఐదో వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కొంత మంది నాయకులు వస్తారు, మాయమాటలు చెప్తారు, వారిని లెక్క చేయకుండా బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్కే ఓటేయాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీకేమీ ఇబ్బంది ఉండదని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న తాను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి వార్డుకు సీసీ రోడ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కుటుంబానికి అందించామన్నారు. 13 ఏళ్ల కింద ఎమ్మెల్యేగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు తన కొడుకు కోసం మెదక్ టికెట్ను ఆశించి భంగపడి అప్పటికప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఓట్ల కోసం వస్తుండు వాళ్ల మాటలు నమ్మొద్దు. మోసగించి ఎమ్మెల్యే అయినంక పత్తాలేకుండా పోవడం వారి నైజం. అసెంబ్లీ టికెట్ల కోసం సభ్యత్వం లేకున్నా కాంగ్రెస్లో డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చిన గజదొంగ రేవంత్రెడ్డిఅని మండిపడ్డారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రతిఒక్కరికీ రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
ప్రచారంలో పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ చైర్మన్ సరాఫ్ యాదగరి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, రామాయంపేట మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, మల్యాల కవిత, సుందర్సింగ్, బొర్ర అనిల్, చంద్రపు శోభ, చిలుక గండాధర్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్రెడ్డి, మల్యాల కిషన్, శ్యాంసుందర్, చింతల యాదగిరి, డైరెక్టర్లు చింతల రాములు, రాజు యాదవ్, మర్కు దత్తు, కో ఆప్షన్ మెంబర్ బాలుగౌడ్, కౌసర్ బేగం, ఎస్కే హైమద్, బీఆర్ఎస్ నాయకులు కాలనీల వాసులు వెంకటి, యాదగిరి, చంద్రం, సిద్దు, అరుణ్, అనిల్, రవి, శ్రీనువాస్, పోచయ్య, సత్తమ్మ, మాధవి, సుమలత, నవనీత, సౌందర్య, లక్ష్మి, రమేశ్, రాములు, నర్సింహులు, రమేశ్, ఇమ్రాన్, బాబుమియ, చాంద్పాష, షాదుల్, వాజిద్, దేవుని శ్రీనువాస్, కమ్మరి శ్రీను, స్వామి, యాదగిరి, భరత్, ప్రకాశ్, యాదేశ్, సంతోష్, మైసాగౌడ్, రాజు గౌడ్, గంగరాములు తదితరులు ఉన్నారు.